Monday, July 30, 2012

ఆధునిక భారత నిర్మాత రాజా రామ్మోహన్ రాయ్





రాజా రామ్మోహన్ రాయ్ (మే 22, 1774 – సెప్టెంబర్ 27, 1833) సుప్రసిద్ధ భారతీయ సంఘ సంస్కర్త. బ్రహ్మ సభ వ్యవస్థాపకుడు. 1828లో ఇది బ్రహ్మ సమాజంగా స్థిరపడింది. భారతీయ సామాజిక, మత సంస్కరణోద్యమానికి ఇది వెన్నుదన్నుగా నిలిచింది. రాజకీయాలు, ప్రభుత్వ పాలన, విద్య, మత వ్యవహారాలు వంటి పలు రంగాల్లో రాయ్ గణనీయంగా ప్రభావం చూపారు.

 సతీ సహగమనం అనే హైందవ దురాచారాన్ని రూపుమాపడంలో రాజా రామ్మోహన్ రాయ్ చేసిన కృషితో ప్రపంచ ప్రఖ్యాతి సాధించారు. మరణించిన భర్త చితిపై బతికి ఉన్న భార్యను కూడా బలవంతంగా సజీవ దహనం చేసే హిందూ దురాచారంపై పోరాటం చేసిన రాయ్ ఈ దురాచారాన్ని బ్రిటిష్ ప్రభుత్వంచే రద్దు చేయించడంలో విజయం పొందారు.
 1816లో మొట్ట మొదటి సారిగా హిందూయిజం అనే పదాన్ని ఆంగ్ల భాషకు అందించిన కీర్తి కూడా రాజారామ్మోహన్ రాయ్‌కే దక్కుతుంది. తన కాలపు సమాజానికి చేసిన సేవలకు గానూ ఇతడు బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమంలో అతి ముఖ్యమైన వ్యక్తిగా చరిత్రకెక్కారు.
 బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనమునకు పితామహునిగా భావించబడే రాజా  రామ్మోహన్ రాయ్  (మే 22, 1772 – సెప్టెంబరు 27, 1833) బ్రహ్మ సమాజ్, భారతదేశంలో మొదటి సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలను ప్రారంబించాడు. ఆతని విశేషమైన ప్రభావము రాజకీయ, ప్రభుత్వ నిర్వహణ, విద్య రంగముల లోనే కాకుండా హిందూ మతము పైన కూడా కనపడుతున్నది.
 ఇతడు గొప్ప సంఘసంస్కర్త. బ్రిటీష్ ఇండియా కాలంలో అప్పటి ప్రముఖ సాంఘిక దురాచారమైన సతీసహగమనాన్ని రూపు మాపడానికి చాలా కృషిచేశాడు. వితంతు పునర్వివాహానికి కూడా మద్దతు పలికినాడు. స్త్రీవిద్యకై పాటుపడ్డాడు. బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు. ఆంగ్ల విద్యకు అనుకూలంగా ఉండి దేశంలో ఆంగ్ల విద్యావిధానానికి కృషిచేశాడు.
 1828 లో ఇంగ్లాండు‌కు వెళ్ళక ముందు ద్వారకా నాథ టాగూర్‌తో కలసి బ్రహ్మసమాజ్‌ను ప్రారంబించాడు. బ్రహ్మసమాజ్ ఒక ముఖ్యమైన ఆధాత్మిక, మత సంస్కరణ ఉద్యమముగా మారి బెంగాల్‌లో సాంఘిక , వివేచనాత్మక సంస్కరణలకు దారి తీసింది. వీటన్నిటి వలన రాజా రామ్మోహన్ రాయ్, బెంగాల్ రెనైసాన్స్‌లో ఒక ముఖ్యుడిగా భావింపబడినాడు.
1831 లో మొఘల్ సామ్రాజ్య రాయబారిగా ఇంగ్లండు కు వెళ్ళేను. ఫ్రాన్స్ ను కూడా దర్శించెను.

1 comment: