స్వతంత్ర పోరాటంలో సమరశంఖం ‘వందేమాతరం’

బంకించంద్ర తండ్రి మిడ్నాపూర్ జిల్లా డిప్యూటీ కలెక్టర్గా పనిచేసేవారు. ఛటర్జీ సోదరుడు సంజీవ్ చంద్ర ఛటోపాధ్యాయ మంచి నవలారచయితగా పేరుగడించాడు. చిన్నప్పటినుండే రచనల పట్ల ఎంతో ఆసక్తి ఉన్న బంకించంద్ర బెంగాలీలో అనేక రచనలు చేశారు. ఈయన రచనల్లో ప్రముఖ రచన ‘ఆనంద్మఠ్’. భారత స్వతంత్ర సంగ్రామంలో సమరశంఖంగా పనిచేసిన మన జాతీయగీతం ‘వందేమాతరం’ ఈ గ్రంథం నుండి స్వీకరించబడినదే. కవిగా, వ్యాసరచయితగా, సంపాదకుడిగా, అచంచల దేశభక్తుడిగా నిలిచిన బంకించంద్ర జయంతి సందర్భంగా ఆయన సేవలను మననం చేసుకోవడం మనందరి బాధ్యత. వ్యాసరచయిత మరియు సంపాదకుడు. ఇతని రచన వందేమాతరం ఇతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇతను వ్రాసిన ఆనంద్ మఠ్ అనే నవలనుండి ఈ గీతాన్ని సంగ్రహించారు. ఈ గీతం భారత స్వతంత్ర సంగ్రామంలో సమరశంఖంగా పనిచేసింది.
బంకించంద్ర ఛటర్జీ రచించిన బెంగాలీ గీతం వందేమాతరం, అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదంగా ఉపయోగపడింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ గేయాన్ని జాతీయగేయంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.1857 ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం మొదలుకుని భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో దేశ ప్రజలను ఒక్కతాటిపై నిలిపిన మహత్తర గీతం వందేమాతరం.
భారత స్వాతంత్ర్య ఉద్యమకారుల చేతిలో పదునైన ఆయుధం ఈ గీతం. ప్రముఖ బెంగాలీ కవి, వ్యాస రచయిత మరియు సంపాదకుడు బంకించంద్ర ఛటర్జీ రచించిన బెంగాలీ గీతం వందేమాతరం, అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదంగా ఉపయోగపడింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ గేయాన్ని జాతీయగేయంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.
రచనలు
కాల్పనికాలు
- దుర్గేశ్ నోందిని (మార్చి 1865)
- కపాలకుండల (1866)
- మృణాళిని (1869)
- విషభ్రిష్క (విషవృక్షం, 1873)
- ఇందిర (1873, 1893)
- జుగలంగురియా (1874)
- రాధారాణి (1876, 1893)
- చంద్రశేఖర్ (1877)
- కమలకంటేర్ దప్తార్ (1875)
- రజని(1877)
- కృష్ణకంటేర్ ఉఇల్ (1878)
- రాజసింహ (1882)
- ఆనంద్ మఠ్ (1882)
- దేవి చౌధురాణి (1884)
- కమలకంఠ (1885)
- సీతారాం (మార్చి 1887)
- ముచీరామ్ గురేర్ జీవంచరిత
ధార్మిక రచనలు
- కృష్ణ చరిత (1886)
- ధర్మతత్వ (1888)
- దేవతత్వ
- శ్రీమద్ వగవత్ గీత
రచనల సంకలనం
- లలితా ఓ మానస్ (1858)
వ్యాసాలు
- లోక్ రహస్య (1874, 1888)
- బింజన్ రహస్య (1875)
- బిచిత్ర ప్రబంధ (1876) (1892)
- సామ్య (1879)
No comments:
Post a Comment