Monday, July 30, 2012

వందేమాతరం......భారత జాతీయగేయం


వందేమాతరం వందేమాతరం

సుజలాం సుఫలాం మలయజ శీతలామ్
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం...1

శుభ్రజ్యోత్స్నం పులకిత యామినీమ్
పుల్లకు సుమిత ద్రుమదల శోభినీమ్
సుహాసినీం సుమధుర భాషినీం
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం...2

కోటి కోటి కంఠ కలకల నివాద కరాలే
కోటి కోటి భుజై ధృత ఖర కరవాలే
అబలాకేనో మాం ఎతో బలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం మాతరం వందేమాతరం...3

తుమి విద్యా తుమి ధర్మ
తుమి హృది తుమి మర్మ
త్వంహి ప్రాణః శరీరే
బహుతే తుమి మా శక్తి
హృదయే తుమి మా భక్తి
తో మారయి ప్రతిమాగడి మందిరే మందిరే వందేమాతరం...4

త్వంహి దుర్గా దశ ప్రహరణధారిణీ
కమలా కమలదళ విహారిణీ
వాణి విద్యాదాయినీ, నమామిత్వాం, నమామి కమలాం
అమలాం, అతులాం, సుజలాం, మాతరం వందేమాతరం...5
శ్యామలాం, సరలాం, సుస్మితాం, భూషితాం
ధరణీం, భరణీం, మాతరం వందేమాతరం...6

తెలుగులొ భావం........
తల్లికి నమస్కరించుచున్నాను. మంచినీరు, మంచి పంటలు, మలయమారుతముల చల్లదనము గలిగి సస్యశ్యామలమైన (మా) తల్లికి నమస్కరించుచున్నాను.
తెల్లని వెన్నెలలతో పులకించిన రాత్రులు గలిగి, వికసించిన పూలు, చివురులుగల తరువులతో ప్రకాశించుచు దరహాసములతోనూ, మధుర భాషణములతోను, సుఖమును, వరములను ఇచ్చు (మా) తల్లికి నమస్కరించుచున్నాను.
కోటి కోటి కంఠముల కల కల నినాదములతో కరకు తేలిన తల్లి! కరకు కత్తులు ధరించిన అనేక కోట్ల భుజముల బలముగల మాతా! అబలలకు బలమైనదేవీ? వివిధ శక్తులు ధరించి శత్రువుల నివారించుచు (మమ్ము) తరింపజేయగల మా తల్లీ! నమస్కరించుచున్నాను.
నీవే విద్య, నీవే ధర్మము, నీవే హృదయము, నీవే మర్మము. శరీరములో ప్రాణము నీవే! తల్లి! మా శక్తివి, మా మనస్సులలోని భక్తివి నీవే! మా హృదయ మందిరములలో వెలసిన ప్రతిమవు నీవే! నీకు నమస్కరించుచున్నాను.
పది ఆయుధములు చేతబట్టిన దుర్గవు నీవే. పద్మదళములందు విహరించెడి లక్ష్మివి నీవే. విద్యా దాత్రియైన శారదవు నీవే. కమలా! అమలా! అతులా! సుజలా! సుఫలా! శ్యామలా! సరళా! సుస్మితా! అలంకృతా! (మమ్ము) భరించుమాతా! భూమాతా! నీకు నమస్కరించుచున్నాను.తల్లికి నమస్కరించుచున్నాను. మంచినీరు, మంచి పంటలు, మలయమారుతముల చల్లదనము గలిగి సస్యశ్యామలమైన (మా) తల్లికి నమస్కరించుచున్నాను.
తెల్లని వెన్నెలలతో పులకించిన రాత్రులు గలిగి, వికసించిన పూలు, చివురులుగల తరువులతో ప్రకాశించుచు దరహాసములతోనూ, మధుర భాషణములతోను, సుఖమును, వరములను ఇచ్చు (మా) తల్లికి నమస్కరించుచున్నాను.
కోటి కోటి కంఠముల కల కల నినాదములతో కరకు తేలిన తల్లి! కరకు కత్తులు ధరించిన అనేక కోట్ల భుజముల బలముగల మాతా! అబలలకు బలమైనదేవీ? వివిధ శక్తులు ధరించి శత్రువుల నివారించుచు (మమ్ము) తరింపజేయగల మా తల్లీ! నమస్కరించుచున్నాను.
నీవే విద్య, నీవే ధర్మము, నీవే హృదయము, నీవే మర్మము. శరీరములో ప్రాణము నీవే! తల్లి! మా శక్తివి, మా మనస్సులలోని భక్తివి నీవే! మా హృదయ మందిరములలో వెలసిన ప్రతిమవు నీవే! నీకు నమస్కరించుచున్నాను.
పది ఆయుధములు చేతబట్టిన దుర్గవు నీవే. పద్మదళములందు విహరించెడి లక్ష్మివి నీవే. విద్యా దాత్రియైన శారదవు నీవే. కమలా! అమలా! అతులా! సుజలా! సుఫలా! శ్యామలా! సరళా! సుస్మితా! అలంకృతా! (మమ్ము) భరించుమాతా! భూమాతా! నీకు నమస్కరించుచున్నాను.

రిషి బంకించంద్ర ఛటోపాధ్యాయ..


స్వతంత్ర పోరాటంలో సమరశంఖం ‘వందేమాతరం’
Bankimchandraదేశానికి గర్వకారణమైన జాతీయగేయాన్ని రచించిన అచంచల దేశభక్తుడు బంకించంద్ర ఛటర్జీ. ఈయన అసలుపేరు ‘రిషి బంకించంద్ర ఛటోపాధ్యాయ’. అయితే బ్రిటీష్‌వారికి నోరు తిరగక ఆయన పేరును ‘బంకించంద్ర ఛటర్జీ’ అని పిలిచేవారు. క్రమంగా అదే పేరు ఆయనకు స్థిరపడిపోయింది. బంకించంద్ర ఛటర్జీ జూన్‌ 27, 1838 న పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లా, కచ్రపర అనే చిన్న ఊరిలో జన్మించారు. చటర్జీ తల్లిదండ్రుల పేర్లు... దుర్గాదేవి, యాదవచంద్ర ఛటోపాధ్యాయ. ముగ్గురు అన్నదమ్ములలో చిన్నవారు బంకించంద్ర.

బంకించంద్ర తండ్రి మిడ్నాపూర్‌ జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసేవారు. ఛటర్జీ సోదరుడు సంజీవ్‌ చంద్ర ఛటోపాధ్యాయ మంచి నవలారచయితగా పేరుగడించాడు. చిన్నప్పటినుండే రచనల పట్ల ఎంతో ఆసక్తి ఉన్న బంకించంద్ర బెంగాలీలో అనేక రచనలు చేశారు. ఈయన రచనల్లో ప్రముఖ రచన ‘ఆనంద్‌మఠ్‌’. భారత స్వతంత్ర సంగ్రామంలో సమరశంఖంగా పనిచేసిన మన జాతీయగీతం ‘వందేమాతరం’ ఈ గ్రంథం నుండి స్వీకరించబడినదే. కవిగా, వ్యాసరచయితగా, సంపాదకుడిగా, అచంచల దేశభక్తుడిగా నిలిచిన బంకించంద్ర జయంతి సందర్భంగా ఆయన సేవలను మననం చేసుకోవడం మనందరి బాధ్యత. వ్యాసరచయిత మరియు సంపాదకుడు. ఇతని రచన వందేమాతరం ఇతనికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇతను వ్రాసిన ఆనంద్‌ మఠ్‌ అనే నవలనుండి ఈ గీతాన్ని సంగ్రహించారు. ఈ గీతం భారత స్వతంత్ర సంగ్రామంలో సమరశంఖంగా పనిచేసింది. 
బంకించంద్ర ఛటర్జీ రచించిన బెంగాలీ గీతం వందేమాతరం, అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదంగా ఉపయోగపడింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ గేయాన్ని జాతీయగేయంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.1857 ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం మొదలుకుని భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో దేశ ప్రజలను ఒక్కతాటిపై నిలిపిన మహత్తర గీతం వందేమాతరం. 
 భారత స్వాతంత్ర్య ఉద్యమకారుల చేతిలో పదునైన ఆయుధం ఈ గీతం. ప్రముఖ బెంగాలీ కవి, వ్యాస రచయిత మరియు సంపాదకుడు బంకించంద్ర ఛటర్జీ రచించిన బెంగాలీ గీతం వందేమాతరం, అహింసాయుత భారత స్వాతంత్ర్య ఉద్యమంలో రణన్నినాదంగా ఉపయోగపడింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ గేయాన్ని జాతీయగేయంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.
రచనలు 
కాల్పనికాలు
  • దుర్గేశ్ నోందిని (మార్చి 1865)
  • కపాలకుండల (1866)
  • మృణాళిని (1869)
  • విషభ్రిష్క (విషవృక్షం, 1873)
  • ఇందిర (1873, 1893)
  • జుగలంగురియా (1874)
  • రాధారాణి (1876, 1893)
  • చంద్రశేఖర్ (1877)
  • కమలకంటేర్ దప్తార్ (1875)
  • రజని(1877)
  • కృష్ణకంటేర్ ఉఇల్ (1878)
  • రాజసింహ (1882)
  • ఆనంద్ మఠ్ (1882)
  • దేవి చౌధురాణి (1884)
  • కమలకంఠ (1885)
  • సీతారాం (మార్చి 1887)
  • ముచీరామ్ గురేర్ జీవంచరిత
ధార్మిక రచనలు
  • కృష్ణ చరిత (1886)
  • ధర్మతత్వ (1888)
  • దేవతత్వ
  • శ్రీమద్ వగవత్ గీత
రచనల సంకలనం
  • లలితా ఓ మానస్ (1858)
వ్యాసాలు
  • లోక్ రహస్య (1874, 1888)
  • బింజన్ రహస్య (1875)
  • బిచిత్ర ప్రబంధ (1876) (1892)
  • సామ్య (1879)

బెంగాల్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్



బెంగాల్ కు చెందిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన విద్యా సంపద, దయాగుణం చూసి అచ్చెరువొందని వారు లేరంటే అతిశయోక్తి కాదు. బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనంలో ప్రముఖ పాత్ర పోషించారాయన.
అప్పట్లో ఆయన బ్రిటీష్ ప్రభుత్వం నిర్వహించే ఒక సంస్కృత కళాశాలలో సంస్కృతం బోధించేవారు. ఒకసారి ఆ సంస్థలో ఒక ఉన్నత స్థాయి ఉద్యోగానికి ఖాళీ ఏర్పడింది. ఆ ప్రిన్సిపల్ అందుకు విద్యాసాగర్ సరైన వ్యక్తి అని అనుకున్నాడు. కానీ విద్యాసాగర్ అందుకు ఒప్పుకోలేదు.
ఆ ప్రిన్సిపల్ ఎందుకని అడిగాడు.
“ఎందుకంటే నా కంటే సంస్కృతం బాగా తెలిసిన వారు ఇంకొకరున్నారు. ఈ పదవికి వారే అర్హులు” అన్నారు.
అప్పుడా ప్రిన్సిపల్ “చూస్తుంటే బతకనేర్చిన వాడిలా లేవు. నీకు డబ్బు అవసరమా? లేదా? నీవు పెద్ద కుటుంబాన్ని పోషించాలని గుర్తుంచుకో. మీ సహోదరులు నీమీదనే ఆధారపడి ఉన్నారు. నాకు నీ మీద ఎనలేని విశ్వాసం, గౌరవం ఉన్నాయి. కాబట్టి ఈ పదవిని నువ్వే స్వీకరించాలి” అన్నాడు.
అయినా విద్యాసాగరుడు తన పట్టు వదల్లేదు. “నాకన్నా ఎక్కువ పరిజ్ఞానం గలవారు ఇంకొరున్నారు. ఆయన సాక్షాత్తూ మా గురువులు” అన్నాడు.
“నీతో నేను అంగీకరించలేను” అన్నాడు ఆ ప్రిన్సిపల్.
“మీరెన్ని చెప్పినా సరే, నాకు మాత్రం ఆ పదవి స్వీకరించడం ఇష్టం లేదు” అన్నాడు విద్యాసాగర్.
“సరే! ఆ పదవికి ధరఖాస్తు చెయ్యాలంటే ఎల్లుండి దాకే సమయముంది. మీ గురువు గారు అందుకు అప్లై కూడా చేయలేదు. లేకపోతే దాన్ని అధికారికంగా గుర్తించలేము ” అన్నాడు.
“అలా అయితే నేనే మా గురువు గారింటికి వెళ్ళి అప్లికేషన్ తీసుకు వస్తాను” అన్నాడు విద్యాసాగర్.
సుమారు యాభై మైళ్ళ దూరంలో ఉన్న ఆయన గురువు గారి దగ్గరకు వెళ్ళాలంటే విద్యాసాగర్ కొన్ని గ్రామాలు దాటి వెళ్ళాలి.  దాన్ని దాటాలంటే ఎద్దుల బండి ఉండాలి. లేకపోతే నడకే శరణ్యం. ఆయన విద్యా సంపన్నుడు, దయా సంపన్నుడేకానీ శారీరక బల సంపన్నుడు కాదు. ఆయనికి అంత దూరం నడవాలంటే నిజంగా కష్ట సాధ్యమైన పనే. ఆ రోజు మధ్యాహ్నమే బయలు దేరి మరుసటి రోజుకు వారి గురువుగారిల్లు చేరాడు. గురువు గారు విద్యాసాగర్ ఎందుకోసం వచ్చాడో తెలుసుకోగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆయన్ని ఒక్కసారిగా గట్టిగా కౌగలించుకున్నాడు.
“భగవంతుడు కరుణా సముద్రుడయ్యా! నువ్వు నా మీద కరుణతో అంత దూరం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నడిచి వచ్చావు. పేరులోనే ఈశ్వరుణ్ణి పెట్టుకున్నావు. సాక్షాత్తు భగవత్స్వరూపుడివయ్యా నీవు” అని ఆశీర్వదించాడు.
విద్యాసాగర్ ఆ అప్లికేషన్ ని నింపి, గురువు గారి చేత సంతకం చేయించుకున్నాడు. మళ్ళీ యాభై మైళ్ళు వెనక్కి నడిచి తన గ్రామాన్ని చేరుకునే సరికి బాగా అలిసిపోయాడు. కానీ తన గురువు గారికి ఉద్యోగం లభిస్తుందన్న ఆనందం మాత్రం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ ప్రిన్సిపల్ మాత్రం కుర్చీ లో కూర్చుని మారు మాట్లాడలేకపోయాడు. అసలీ విద్యాసాగర్ లాంటి మనుషులు ఈ భూమ్మీద ఇంకా ఉన్నారా? అని ఆశ్చర్యపోయాడు.
అప్పట్నించీ విద్యాసాగర్ కి నెలకి యాభై రూపాయలు లభిస్తే ఆయన గురువు గారికి తొంభై రూపాయాలు లభించేది.

ఈశ్వర్ చంద్ర బిర్సింగా గ్రామము (నేటి పశ్చిమ బెంగాల్) లో ఒక పేద బ్రాహ్మణ కుటుంబము లో జన్మించాడు. బాల్యమంతా పేదరికము తో గడుపుతూ ఎంతో పుస్తకజ్ఞానము సంపాదించెను. తండ్రి సంస్కృత ఉపాద్యాయుడు కావడము చేత కొడుకు కూడ ఆదే వృత్తిని అవలంబించాడు. మొదట గ్రామములో పాఠశాలలో చదివిన ఈశ్వర్ ఆ తరువాత తండ్రికి కలకత్తాలో 1828 లో ఉద్యోగము దొరకడము తో కలకత్తాకు మారెను. ఒక చుట్టము మధుసూదన్ వాచస్పతి , ఈశ్వర్ నుసంస్కృత కళాశాల కు పంపమని కోరగా అక్కడికి పంపబడెను.

1839 లో హిందూ న్యాయశాస్త్రము లో ఉత్తీర్ణుడై విద్యాసాగర్ బిరుదు ను పొందెను. రెండు సంవత్సరముల తరువాత ఫోర్ట్ విలియమ్ కాలేజి లో ప్రధాన సంస్కృత పండిత్ పదవిని పొందెను. అక్కడ ఆయన సంస్కృత కళాశాలలో అన్ని కులముల బాలకులకు విద్య నేర్పించాలని, మహిళలను కూడా విద్యాభ్యాసానికి ప్రోత్సహించాలని పోరాటము మొదలు పెట్టెను. ఈశ్వర్ చంద్రకు భయము లేకపోవడము చేత, ఆతను తమ వాడు(బ్రాహ్మణుడు) కావడము చేత సంస్కృత కాలేజీ యాజమాన్యమునకు ఇబ్బంది పెరిగెను.
1849 లో కాలేజీ నుండి రాజీనామా చేసి, అభిమానుల ప్రోద్బలము తో ఒక సంవత్సరము తరువాత విద్యా విభాగము లో అతని కోసము ఏర్పరిచిన సాహిత్య టీచర్ పదవిని వరించెను. ఆతను కాలేజీలో పైన చెప్పిన మార్పులు జరుగ వలెనని కోరెను. స్కూల్ ఇన్స్‌పెక్టర్ పదవి లో 20 స్కూళ్ళను స్థాపించెను. ఆ తరువాత ఫోర్ట్ విలియమ్స్ కాలేజీ మూతబడి కలకత్తా విశ్వవిద్యాలయము ప్రారంభము కాగా విద్యాసాగర్ స్థాపక సభ్యుడయ్యెను. ఆ తరువాత సంస్కృత ప్రెస్ అత్యంత సాఫల్యము చెంది అతని శక్తులన్నిటినీ వాడుకొనెను. ఆప్పటికే ఈశ్వర్ చంద్ర మహిళల హక్కుల కొరకు పోరాటము ప్రారంభించెను.
విద్యాసాగర్ ఔన్నత్యము విశాల హృదయము కలవాడని అతనిని ఎరిగిన వారు ఒప్పుకుందురు. ఆ రోజుల్లో చాలామంది సంస్కర్తల లాగే విద్యాసాగర్ ధనవంతుడు కాదు. ఆనాటి ధనికులకున్న అహంకారము లేకపోవడము వలన సమాజములో అదృష్టము లేనివారి పై కనికరము చూపడానికి వీలైనది. చిన్న, పెద్ద ఆందరికీ సహనము, వినయము లను నేర్పించెను. స్వామి వివేకానంద మాట్లాడుతూ "ఉత్తర భారత దేశములో విద్యాసాగర్ నీడ సోకని నా వయస్సు కలవాడు ఎవ్వడూ లేడు" అన్నాడు.

సంస్కృత ముద్రణాలయం 

1847 లో విద్యాసాగర్ సంస్కృత ముద్రణాలయము మరియు తాళ పత్ర గ్రంధములను భద్రపరచు కేంద్రము(Depository) ను అమ్హెర్స్ట్ వీథి, కలకత్తా లో 600 రూపాయల అప్పుతో ప్రారంభించెను. కృష్ణసాగర్ జమిందారుల వద్ద ఉన్న ఆనందమంగళ కావ్యము, ఆ తరువాత భేతాళ పంచవింశతి(ప్రముఖ విక్రమభేతాళ కథలు)ని సంస్కృతకథాచరితసాగర్ నుండి అనువదించెను. 1849 లో మిత్రుడు మదన్ మోహన్ తర్కాలంకార్ తో కలిసి పిల్లల బొమ్మల కథలు శిశు శిక్ష ను ప్రారంభించెను. భొధోధోయ్ (జ్ఞానము యొక్క సూర్యోదయము, 1850) ను రచించెను. ఐదు సంవత్సరముల తరువాత వర్ణ పరిచయము (బెంగాలీ అక్షర సంగ్రహము) ను రచించెను. ఆ పాఠ్యపుస్తకమును ఈనాడు కూడా బెంగాలీ బాలురు ఎలిమెంటరీ పాఠశాల లో వాడుతున్నారు.విద్యాసాగర్, తర్కాలంకార్ సర్వ వ్యాప్తమైన శిశు భోదకము,బాల బోధము, వర్ణ బోధము, ఇతర పాఠ్య పుస్తకములను జానపదములు, సామెతలు, అర్థశాస్త్ర శ్లోకములు, శాప విమోచన మార్గములు, మహా పురాణాల నుండి కథలు గల ఇంటిపుస్తకములు గా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. విద్యాసాగర్ బెంగాలీ లో టైపు చేయు విధానము ను 12 అచ్చులు, 40 హల్లుల లో సర్దెను. ప్రింటర్లు టైపు చెయ్యలేని ఆసాధారణ , ఖర్చుతో కూడిన సంయుక్త అక్షరము లను సులభము చెయ్యడానికి ప్రయత్నించెను. దానికి బదులు చూపించలేక పోవడము వలన ఇందులో సాఫల్యము పొందలేక పోయెను.1857 లో సంస్కృత ప్రెస్ లో 84,200 పుస్తకముల కాపీలను ప్రచురించి అమ్మెను.వారసత్వము గా గాని, సొంతముగా గాని ఆస్తి లేకపోవడము వలన విద్యాసాగర్ కు , సంస్కృత ముద్రణాలయం (ప్రెస్) విజయము చాలా అవసరమయ్యెను. అంతే కాకుండా బెంగాలీ ప్రజల తో మాట్లాడుటకు ఒక సాధనము ను కూడా సమకూర్చెను. విద్యాసాగర్ పదములను ఆ నేల మీద ప్రతీ వారికి అందచేసెను. దుకాణము లో గిరాకీ పెరగడము వలన విద్యాసాగర్ కు వ్రాయడానికి ఉత్సాహము కలిగెను. సందేశములను పుస్తకముల ద్వారా అందించుట, పాఠాలు నేర్పడమే కాకుండా మానవతా వాద కార్యములకు కూడా పనికి వచ్చెను. విద్యాభ్యాసము ద్వారా సంఘ సంస్కరణ ఆలోచనలను వేరే వారి నెత్తి మీద రుద్దకుండా వాటిని ఆచరణ లో పెట్టి ఉదాహరణ ద్వారా జనులకు చూపించడానికి వీలు కలిగెను.విద్యాసాగర్ మేళా, విద్యను సమాజమును గురించి జ్ఞానము పంచే పండుగ , ఆతని జ్ఞాపకార్థము 1994 నుండి ప్రతీ సంవత్సరము జరుగుతున్నది. 2001 నుండి కలకత్తా, బీర్సింఘా ల లో జరుగుతున్నది.


ఆధునిక భారత నిర్మాత రాజా రామ్మోహన్ రాయ్





రాజా రామ్మోహన్ రాయ్ (మే 22, 1774 – సెప్టెంబర్ 27, 1833) సుప్రసిద్ధ భారతీయ సంఘ సంస్కర్త. బ్రహ్మ సభ వ్యవస్థాపకుడు. 1828లో ఇది బ్రహ్మ సమాజంగా స్థిరపడింది. భారతీయ సామాజిక, మత సంస్కరణోద్యమానికి ఇది వెన్నుదన్నుగా నిలిచింది. రాజకీయాలు, ప్రభుత్వ పాలన, విద్య, మత వ్యవహారాలు వంటి పలు రంగాల్లో రాయ్ గణనీయంగా ప్రభావం చూపారు.

 సతీ సహగమనం అనే హైందవ దురాచారాన్ని రూపుమాపడంలో రాజా రామ్మోహన్ రాయ్ చేసిన కృషితో ప్రపంచ ప్రఖ్యాతి సాధించారు. మరణించిన భర్త చితిపై బతికి ఉన్న భార్యను కూడా బలవంతంగా సజీవ దహనం చేసే హిందూ దురాచారంపై పోరాటం చేసిన రాయ్ ఈ దురాచారాన్ని బ్రిటిష్ ప్రభుత్వంచే రద్దు చేయించడంలో విజయం పొందారు.
 1816లో మొట్ట మొదటి సారిగా హిందూయిజం అనే పదాన్ని ఆంగ్ల భాషకు అందించిన కీర్తి కూడా రాజారామ్మోహన్ రాయ్‌కే దక్కుతుంది. తన కాలపు సమాజానికి చేసిన సేవలకు గానూ ఇతడు బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమంలో అతి ముఖ్యమైన వ్యక్తిగా చరిత్రకెక్కారు.
 బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనమునకు పితామహునిగా భావించబడే రాజా  రామ్మోహన్ రాయ్  (మే 22, 1772 – సెప్టెంబరు 27, 1833) బ్రహ్మ సమాజ్, భారతదేశంలో మొదటి సామాజిక-మత సంస్కరణ ఉద్యమాలను ప్రారంబించాడు. ఆతని విశేషమైన ప్రభావము రాజకీయ, ప్రభుత్వ నిర్వహణ, విద్య రంగముల లోనే కాకుండా హిందూ మతము పైన కూడా కనపడుతున్నది.
 ఇతడు గొప్ప సంఘసంస్కర్త. బ్రిటీష్ ఇండియా కాలంలో అప్పటి ప్రముఖ సాంఘిక దురాచారమైన సతీసహగమనాన్ని రూపు మాపడానికి చాలా కృషిచేశాడు. వితంతు పునర్వివాహానికి కూడా మద్దతు పలికినాడు. స్త్రీవిద్యకై పాటుపడ్డాడు. బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు. ఆంగ్ల విద్యకు అనుకూలంగా ఉండి దేశంలో ఆంగ్ల విద్యావిధానానికి కృషిచేశాడు.
 1828 లో ఇంగ్లాండు‌కు వెళ్ళక ముందు ద్వారకా నాథ టాగూర్‌తో కలసి బ్రహ్మసమాజ్‌ను ప్రారంబించాడు. బ్రహ్మసమాజ్ ఒక ముఖ్యమైన ఆధాత్మిక, మత సంస్కరణ ఉద్యమముగా మారి బెంగాల్‌లో సాంఘిక , వివేచనాత్మక సంస్కరణలకు దారి తీసింది. వీటన్నిటి వలన రాజా రామ్మోహన్ రాయ్, బెంగాల్ రెనైసాన్స్‌లో ఒక ముఖ్యుడిగా భావింపబడినాడు.
1831 లో మొఘల్ సామ్రాజ్య రాయబారిగా ఇంగ్లండు కు వెళ్ళేను. ఫ్రాన్స్ ను కూడా దర్శించెను.