Monday, July 30, 2012

బెంగాల్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్



బెంగాల్ కు చెందిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన విద్యా సంపద, దయాగుణం చూసి అచ్చెరువొందని వారు లేరంటే అతిశయోక్తి కాదు. బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనంలో ప్రముఖ పాత్ర పోషించారాయన.
అప్పట్లో ఆయన బ్రిటీష్ ప్రభుత్వం నిర్వహించే ఒక సంస్కృత కళాశాలలో సంస్కృతం బోధించేవారు. ఒకసారి ఆ సంస్థలో ఒక ఉన్నత స్థాయి ఉద్యోగానికి ఖాళీ ఏర్పడింది. ఆ ప్రిన్సిపల్ అందుకు విద్యాసాగర్ సరైన వ్యక్తి అని అనుకున్నాడు. కానీ విద్యాసాగర్ అందుకు ఒప్పుకోలేదు.
ఆ ప్రిన్సిపల్ ఎందుకని అడిగాడు.
“ఎందుకంటే నా కంటే సంస్కృతం బాగా తెలిసిన వారు ఇంకొకరున్నారు. ఈ పదవికి వారే అర్హులు” అన్నారు.
అప్పుడా ప్రిన్సిపల్ “చూస్తుంటే బతకనేర్చిన వాడిలా లేవు. నీకు డబ్బు అవసరమా? లేదా? నీవు పెద్ద కుటుంబాన్ని పోషించాలని గుర్తుంచుకో. మీ సహోదరులు నీమీదనే ఆధారపడి ఉన్నారు. నాకు నీ మీద ఎనలేని విశ్వాసం, గౌరవం ఉన్నాయి. కాబట్టి ఈ పదవిని నువ్వే స్వీకరించాలి” అన్నాడు.
అయినా విద్యాసాగరుడు తన పట్టు వదల్లేదు. “నాకన్నా ఎక్కువ పరిజ్ఞానం గలవారు ఇంకొరున్నారు. ఆయన సాక్షాత్తూ మా గురువులు” అన్నాడు.
“నీతో నేను అంగీకరించలేను” అన్నాడు ఆ ప్రిన్సిపల్.
“మీరెన్ని చెప్పినా సరే, నాకు మాత్రం ఆ పదవి స్వీకరించడం ఇష్టం లేదు” అన్నాడు విద్యాసాగర్.
“సరే! ఆ పదవికి ధరఖాస్తు చెయ్యాలంటే ఎల్లుండి దాకే సమయముంది. మీ గురువు గారు అందుకు అప్లై కూడా చేయలేదు. లేకపోతే దాన్ని అధికారికంగా గుర్తించలేము ” అన్నాడు.
“అలా అయితే నేనే మా గురువు గారింటికి వెళ్ళి అప్లికేషన్ తీసుకు వస్తాను” అన్నాడు విద్యాసాగర్.
సుమారు యాభై మైళ్ళ దూరంలో ఉన్న ఆయన గురువు గారి దగ్గరకు వెళ్ళాలంటే విద్యాసాగర్ కొన్ని గ్రామాలు దాటి వెళ్ళాలి.  దాన్ని దాటాలంటే ఎద్దుల బండి ఉండాలి. లేకపోతే నడకే శరణ్యం. ఆయన విద్యా సంపన్నుడు, దయా సంపన్నుడేకానీ శారీరక బల సంపన్నుడు కాదు. ఆయనికి అంత దూరం నడవాలంటే నిజంగా కష్ట సాధ్యమైన పనే. ఆ రోజు మధ్యాహ్నమే బయలు దేరి మరుసటి రోజుకు వారి గురువుగారిల్లు చేరాడు. గురువు గారు విద్యాసాగర్ ఎందుకోసం వచ్చాడో తెలుసుకోగానే కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆయన్ని ఒక్కసారిగా గట్టిగా కౌగలించుకున్నాడు.
“భగవంతుడు కరుణా సముద్రుడయ్యా! నువ్వు నా మీద కరుణతో అంత దూరం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి నడిచి వచ్చావు. పేరులోనే ఈశ్వరుణ్ణి పెట్టుకున్నావు. సాక్షాత్తు భగవత్స్వరూపుడివయ్యా నీవు” అని ఆశీర్వదించాడు.
విద్యాసాగర్ ఆ అప్లికేషన్ ని నింపి, గురువు గారి చేత సంతకం చేయించుకున్నాడు. మళ్ళీ యాభై మైళ్ళు వెనక్కి నడిచి తన గ్రామాన్ని చేరుకునే సరికి బాగా అలిసిపోయాడు. కానీ తన గురువు గారికి ఉద్యోగం లభిస్తుందన్న ఆనందం మాత్రం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ ప్రిన్సిపల్ మాత్రం కుర్చీ లో కూర్చుని మారు మాట్లాడలేకపోయాడు. అసలీ విద్యాసాగర్ లాంటి మనుషులు ఈ భూమ్మీద ఇంకా ఉన్నారా? అని ఆశ్చర్యపోయాడు.
అప్పట్నించీ విద్యాసాగర్ కి నెలకి యాభై రూపాయలు లభిస్తే ఆయన గురువు గారికి తొంభై రూపాయాలు లభించేది.

ఈశ్వర్ చంద్ర బిర్సింగా గ్రామము (నేటి పశ్చిమ బెంగాల్) లో ఒక పేద బ్రాహ్మణ కుటుంబము లో జన్మించాడు. బాల్యమంతా పేదరికము తో గడుపుతూ ఎంతో పుస్తకజ్ఞానము సంపాదించెను. తండ్రి సంస్కృత ఉపాద్యాయుడు కావడము చేత కొడుకు కూడ ఆదే వృత్తిని అవలంబించాడు. మొదట గ్రామములో పాఠశాలలో చదివిన ఈశ్వర్ ఆ తరువాత తండ్రికి కలకత్తాలో 1828 లో ఉద్యోగము దొరకడము తో కలకత్తాకు మారెను. ఒక చుట్టము మధుసూదన్ వాచస్పతి , ఈశ్వర్ నుసంస్కృత కళాశాల కు పంపమని కోరగా అక్కడికి పంపబడెను.

1839 లో హిందూ న్యాయశాస్త్రము లో ఉత్తీర్ణుడై విద్యాసాగర్ బిరుదు ను పొందెను. రెండు సంవత్సరముల తరువాత ఫోర్ట్ విలియమ్ కాలేజి లో ప్రధాన సంస్కృత పండిత్ పదవిని పొందెను. అక్కడ ఆయన సంస్కృత కళాశాలలో అన్ని కులముల బాలకులకు విద్య నేర్పించాలని, మహిళలను కూడా విద్యాభ్యాసానికి ప్రోత్సహించాలని పోరాటము మొదలు పెట్టెను. ఈశ్వర్ చంద్రకు భయము లేకపోవడము చేత, ఆతను తమ వాడు(బ్రాహ్మణుడు) కావడము చేత సంస్కృత కాలేజీ యాజమాన్యమునకు ఇబ్బంది పెరిగెను.
1849 లో కాలేజీ నుండి రాజీనామా చేసి, అభిమానుల ప్రోద్బలము తో ఒక సంవత్సరము తరువాత విద్యా విభాగము లో అతని కోసము ఏర్పరిచిన సాహిత్య టీచర్ పదవిని వరించెను. ఆతను కాలేజీలో పైన చెప్పిన మార్పులు జరుగ వలెనని కోరెను. స్కూల్ ఇన్స్‌పెక్టర్ పదవి లో 20 స్కూళ్ళను స్థాపించెను. ఆ తరువాత ఫోర్ట్ విలియమ్స్ కాలేజీ మూతబడి కలకత్తా విశ్వవిద్యాలయము ప్రారంభము కాగా విద్యాసాగర్ స్థాపక సభ్యుడయ్యెను. ఆ తరువాత సంస్కృత ప్రెస్ అత్యంత సాఫల్యము చెంది అతని శక్తులన్నిటినీ వాడుకొనెను. ఆప్పటికే ఈశ్వర్ చంద్ర మహిళల హక్కుల కొరకు పోరాటము ప్రారంభించెను.
విద్యాసాగర్ ఔన్నత్యము విశాల హృదయము కలవాడని అతనిని ఎరిగిన వారు ఒప్పుకుందురు. ఆ రోజుల్లో చాలామంది సంస్కర్తల లాగే విద్యాసాగర్ ధనవంతుడు కాదు. ఆనాటి ధనికులకున్న అహంకారము లేకపోవడము వలన సమాజములో అదృష్టము లేనివారి పై కనికరము చూపడానికి వీలైనది. చిన్న, పెద్ద ఆందరికీ సహనము, వినయము లను నేర్పించెను. స్వామి వివేకానంద మాట్లాడుతూ "ఉత్తర భారత దేశములో విద్యాసాగర్ నీడ సోకని నా వయస్సు కలవాడు ఎవ్వడూ లేడు" అన్నాడు.

సంస్కృత ముద్రణాలయం 

1847 లో విద్యాసాగర్ సంస్కృత ముద్రణాలయము మరియు తాళ పత్ర గ్రంధములను భద్రపరచు కేంద్రము(Depository) ను అమ్హెర్స్ట్ వీథి, కలకత్తా లో 600 రూపాయల అప్పుతో ప్రారంభించెను. కృష్ణసాగర్ జమిందారుల వద్ద ఉన్న ఆనందమంగళ కావ్యము, ఆ తరువాత భేతాళ పంచవింశతి(ప్రముఖ విక్రమభేతాళ కథలు)ని సంస్కృతకథాచరితసాగర్ నుండి అనువదించెను. 1849 లో మిత్రుడు మదన్ మోహన్ తర్కాలంకార్ తో కలిసి పిల్లల బొమ్మల కథలు శిశు శిక్ష ను ప్రారంభించెను. భొధోధోయ్ (జ్ఞానము యొక్క సూర్యోదయము, 1850) ను రచించెను. ఐదు సంవత్సరముల తరువాత వర్ణ పరిచయము (బెంగాలీ అక్షర సంగ్రహము) ను రచించెను. ఆ పాఠ్యపుస్తకమును ఈనాడు కూడా బెంగాలీ బాలురు ఎలిమెంటరీ పాఠశాల లో వాడుతున్నారు.విద్యాసాగర్, తర్కాలంకార్ సర్వ వ్యాప్తమైన శిశు భోదకము,బాల బోధము, వర్ణ బోధము, ఇతర పాఠ్య పుస్తకములను జానపదములు, సామెతలు, అర్థశాస్త్ర శ్లోకములు, శాప విమోచన మార్గములు, మహా పురాణాల నుండి కథలు గల ఇంటిపుస్తకములు గా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. విద్యాసాగర్ బెంగాలీ లో టైపు చేయు విధానము ను 12 అచ్చులు, 40 హల్లుల లో సర్దెను. ప్రింటర్లు టైపు చెయ్యలేని ఆసాధారణ , ఖర్చుతో కూడిన సంయుక్త అక్షరము లను సులభము చెయ్యడానికి ప్రయత్నించెను. దానికి బదులు చూపించలేక పోవడము వలన ఇందులో సాఫల్యము పొందలేక పోయెను.1857 లో సంస్కృత ప్రెస్ లో 84,200 పుస్తకముల కాపీలను ప్రచురించి అమ్మెను.వారసత్వము గా గాని, సొంతముగా గాని ఆస్తి లేకపోవడము వలన విద్యాసాగర్ కు , సంస్కృత ముద్రణాలయం (ప్రెస్) విజయము చాలా అవసరమయ్యెను. అంతే కాకుండా బెంగాలీ ప్రజల తో మాట్లాడుటకు ఒక సాధనము ను కూడా సమకూర్చెను. విద్యాసాగర్ పదములను ఆ నేల మీద ప్రతీ వారికి అందచేసెను. దుకాణము లో గిరాకీ పెరగడము వలన విద్యాసాగర్ కు వ్రాయడానికి ఉత్సాహము కలిగెను. సందేశములను పుస్తకముల ద్వారా అందించుట, పాఠాలు నేర్పడమే కాకుండా మానవతా వాద కార్యములకు కూడా పనికి వచ్చెను. విద్యాభ్యాసము ద్వారా సంఘ సంస్కరణ ఆలోచనలను వేరే వారి నెత్తి మీద రుద్దకుండా వాటిని ఆచరణ లో పెట్టి ఉదాహరణ ద్వారా జనులకు చూపించడానికి వీలు కలిగెను.విద్యాసాగర్ మేళా, విద్యను సమాజమును గురించి జ్ఞానము పంచే పండుగ , ఆతని జ్ఞాపకార్థము 1994 నుండి ప్రతీ సంవత్సరము జరుగుతున్నది. 2001 నుండి కలకత్తా, బీర్సింఘా ల లో జరుగుతున్నది.


No comments:

Post a Comment