ఆ పిల్లవానికి సెగ గడ్డ వచ్చినది.
అక్కడ గ్రామంలో సెగ్గడ్డలకు నాటు వైద్యం చేయడంలో పేరొందిన మనిషి ఉన్నాడు. ఆ అబ్బాయి ఆ నాటు వైద్యుని దగ్గఱకు వెళ్ళాడు.
సరే! ఈ మన హీరో అన్నాడు:
"నాకు గజ్జలలో సెగగడ్డ వచ్చింది. మందు వేయి భయ్యా!"
అతని వైద్య విధానము ఆ పిల్లవాడికి తెలుసు. అదేమిటంటే, కాల్చిన ఇనుప వస్తువుతో, గడ్డ మీద వాత పెట్టడము అన్న మాట!
వైద్యశిఖామణి కుంపటిలో నిప్పులు రాజేసాడు. నిప్పులలో ఇనుప గరిటనూ, కడ్డీనీ కాల్చాడు. ఆ ఇనప వస్తువులు బాగా ఎర్రగా కాలాయి.
టెన్షన్ తో ఆ బాలుని కళ్ళలో నుండి కన్నీళ్ళు ఉబికి వస్తుంటే ఆపుకుంటూన్నాడు. దానిని గమనించిన గ్రామ డాక్టరు మనసులో జాలి, కరుణ కలుగసాగాయి. దాంతో, అతను తన పద్ధతిని క్రూరంగా అమలు చేయలేక పస్తాయించ సాగాడు.
కాస్సేపు చూసి, పిల్లాడు అన్నాడు కదా "అదేమిటీ? ఇంకా ఆలస్యం చేస్తున్నారు. ఆ సరంజామా చల్లారి పోతున్నాయి; చప్పున ఇక్కడ అంటించు,భయ్యా!"
ధైర్యం ఆ బాలుని సొత్తు కదా మరి ! పెద్దవాళ్ళనైనా తోడు తీసుకు వెళ్ళకుండా, ఇంత ధైర్యంగా అలాంటి క్రూర వైద్యాన్ని చేయించుకో గలిగిన ఆ బాలుని పేరు తెలుసా?
పేరు ప్రఖ్యాతులు గడించిన "సర్దార్ వల్లభాయి పటేల్".
"ఉక్కు మనిషి " అని ఆప్యాయంగా ప్రజలు పిలుచుకునే వల్లభాయ్ పటేలు, అక్టోబరు 1875 వ సంవత్సరములో 31 వ తేదీ అక్టోబరు నెలలో (born 31st of October 1875. ) పుట్టాడు.
ఆ రోజులలో లక్షలాది రూపాయిలను ఆర్జించగలిగిన బారిష్టరు ప్రాక్టీసును వదిలివేసాడు.
దేశభక్తితో స్వాతంత్ర్య పోరాటములో పాల్గొని గాంధీజీ, నెహ్రూలకు కుడి భుజము అయ్యాడు.
- భారత దేశపు ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జవేరిభాయ్, లాడ్ బాయి దంపతులకు 1875, అక్టోబరు 31న గుజరాత్లోని నాడియార్లో జన్మించాడు. ఇతను ప్రముఖ స్వాతంత్ర యోధుడు మాత్రమే కాడు, స్వాతంత్రానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సపలుడైన ప్రముఖుడు.హైదరాబాదు, జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశము లో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుంది. ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోధ్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు.
- బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశప్రజల దృష్టిని ఆకర్షించాడు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు. 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించాడు. భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించాడు.
- రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్గా వ్యవహరించాడు. స్వాతంత్రానంతరం జవహార్ లాల్ నెహ్రూ మంత్రిమండలిలో హోంమంత్రి గాను, ఉప ప్రధానమంత్రి గాను బాధ్యతలను నిర్వహించాడు.
- దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశాడు. నెహ్రూ మంత్రిమండలిలో ఉన్ననూ అనేక విషయాలలో నెహ్రూతో విభేధించాడు. నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు బలప్రయోగం చేపట్టి సఫలుడైనాడు. కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్ననూ అనేక దేశ సమస్యలను తనదైన పద్దతితో పరిష్కరించి 1950 డిసెంబరు 15న మరణించాడు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదాన్ని ఇచ్చి గౌరవించింది.
బారిష్టరు పట్టా పుచ్చుకొని ఇంగ్లాండు నుంచి తిరిగి వచ్చిన వల్లబ్ భాయి పటేల్ దేశంలో జర్గుతున్న జాతీయోద్యమం ప్రభావానికి లోనైనాడు. తన వృత్తిని నిర్వహిస్తూనే గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు. 1928 లో బార్దోలీ లో బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా కిసాన్ ఉద్యమం చేపట్టి విజయవంతంగా నడిపించి, దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. అప్పుడే అతనికి సర్దార్ అనే పేరు వచ్చింది.
గాంధీ మొదలుపెట్టిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని దాదాపు 300,000 మంది సభ్యులతో కలసి దాదాపు 15 లక్షల రూపాయల విరాళాలు సేకరించారు. విదేశీ వస్తు దహనంలో భాగంగా తనవద్దనున్న తెల్లదొరలు వేసుకొనే బట్టలను అగ్నికి ఆహుతి చేసారు. తన కుమార్తె మణి, కొడుకు దాహ్యాతో కలసి జీవితాంతం ఖాదీ బట్టలు వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. గుజరాత్లో మద్యపానం, అస్పృశ్యత, కులవిచక్షణలకు వ్యతిరేకంగా పని చేసారు.
1931 కరాచి భారత జాతీయ కాంగ్రెస్ సదస్సుకు అద్యక్షుడిగా ఎన్నికైనాడు. ఉప్పు సత్యాగ్రహం, 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమాలలో కూడ ప్రముఖ పాత్ర వహించాడు
ప్రపంచంలోనే అతి పొడవైన సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహం

ఇప్పటివరకు ప్రపంచంలోనే అతి పొడవైన విగ్రహం అమెరికాలోని లిబర్టి అని అందరికి తెలుసు, కాని ఇదే సమాదానం మూడు సంవత్సరాల తర్వాత ఇస్తే కచితంగా అది తప్పే అవుతుంది. ఎందుకంటే ప్రపంచంలోనే అతి పొడవైన విగ్రహాన్ని మన భారత దేశంలో నిర్మిస్తున్నారు. లిబర్టి విగ్రహం ఎత్తు 93 మీ. కాని దీనికి రెండింతల ఎత్తు విగ్రహ నిర్మాణ ఏర్పాట్లు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ప్రారంబించారు. సర్దార్ సరోవర్ డ్యాం కి మూడు కి.మీ. దూరంలో ఉన్న సాదుభేట్ లో 182 మీ. విగ్రహాన్ని నిర్మిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోడి తెలిపారు.
ఇంతకీ ఈ విగ్రహం ఎవరిదో తెలుసా, బ్రిటీషు సామ్రాజ్యాన్ని వణికించిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ ది. ఐక్యతా విగ్రహంగా దీనికి నామకరణం చేసారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా టూరిజాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా, ఆ ప్రాంతములో ఉన్న గిరిజనులకు ఉపాదిని కుడా అందించనున్నట్లు సి.ఎం.నరేంద్ర మోడి చెప్పారు.
ఉక్కు మనిషి

సర్దార్ వల్లభాయ్ పటేల్ అనగానే భారతీయులకు ' ఉక్కు మనిషి ' గా గుర్తుకొస్తారు.
తెలుగువారికి నిజాం చేతుల్నుంచి, రజాకార్ల దౌష్ట్యాల నుంచి హైదరాబాద్ సంస్థానాన్ని మిలటరీ చర్యతో విడిపించిన నాయకుడు గుర్తుకొస్తాడు.
ఈరోజుల్లో దేశం, రాష్ట్రం అనేవి తమ స్వంత జాగీరుల్లాగా, కంపెనీల లాగ చూసుకుంటూ, దానికి తమ తదనంతరం తమ పిల్లల్ని, బంధువుల్ని వారసులుగా తయారు చెయ్యడానికి ప్రజలను పావులుగా వాడుకుంటున్న నాయకులే అడుగడుగునా కనిపిస్తారు. వాళ్ళు, వాళ్ళని గుడ్డిగా నమ్మే వాళ్ళు ఈ విషయం నమ్ముతారో లేదో తెలియదు కానీ రాజకీయాల్లోను, రాజకీయ నాయకుల్లోనూ విలువలు మిగిలున్న రోజుల్లో జరిగిన సంగతి కనుక ఇది నిజంగానిజం
పటేల్ గారికి ఒక కుమార్తె - మణిబెన్ పటేల్. ఒక్కడే సుపుత్రుడు దహ్యాభాయ్ పటేల్. సర్దార్ పటేల్ గారు భారత ఉప ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో వారి పుత్రుడు బొంబాయిలో ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త. తండ్రి ఎంత నిజాయితీపరుడో కొడుకు అంత అవినీతి పరుడు. తండ్రికి తెలియకుండా ఆయన పదవిని అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడేవాడు.
పటేల్ గారికి ఈ విషయం తెలిసింది. వెంటనే అప్పటి పరిశ్రమల శాఖ మంత్రికి ఒక లేఖ రాసారు. అందులో విషయం చదివితే సర్దార్ పటేల్ నిజాయితీ ఏమిటో, నాయకుడంటే ఎలా ఉండాలో తెలుస్తుంది. ఆ లేఖలో......
' నా కుమారుని పరిశ్రమల గురించి గానీ, అతని ప్రవర్తన గురించి గానీ నాకు ఎంతమాత్రం సంబంధం లేదు. ప్రభుత్వ పరంగా అతని మీద గానీ, అతని పరిశ్రమల విషయంలో గానీ ఏ రకమైన చర్యలు తీసుకోవడానికైవా మీరేమీ వెనుకాడననక్కరలేదు. మీరే చర్యలు తీసుకున్నా నేనేమీ కలుగజేసుకోను. '
ఇదీ ఆ లేఖ సారాంశం. ఇప్పటి వాళ్ళకు ఇదీ ఒక ప్రచారం కోసం చేసే జుమ్మిక్కుగా కనిపిస్తే ఆశ్చర్యపోనక్కరలేదు. ఎందుకంటే మనం రోజూ చూసేవి ఇలాంటి జిమ్మిక్కులే కనుక. కానీ ఆయన నిజాయితీని, నిబద్ధతనీ శంకించేవాళ్ళకు కొసమెరుపు ఏమిటంటే సర్దార్ వల్లభాయి పటేల్ అవినీతిని సహించలేక, తన ఏకైక పుత్రుడి మొహం చూడడానికి కూడా ఇష్టపడక చివరి రోజులు తన మిత్రుడి ఇంటిలో గడిపి అక్కడే కన్నుమూసారు. ఈ రోజుల్లో అలాంటి రాజకీయ నాయకుల్ని ఊహించగలమా ?
1991లో భారత ప్రభుత్వం ఆలస్యంగానైనా వల్లబ్ భాయి పటేల్ సేవలను గుర్తించి భారత రత్న బిరుదును మరణానంతరం ప్రకటించించింది.
No comments:
Post a Comment